నేరేడ్మెట్:థాయ్లాండ్లో జరిగిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ మానసి జోషి మూడు పతకాలతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మానసి 22-20, 19-21, 14-21తో మన్దీప్కౌర్ చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. మహిళల డబుల్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్ తుది పోరులో పోరాడి ఓడిన మానసి రెండు రజత పతకాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ను కోచ్ రాజేందర్ అభినందించారు.