షెన్జెన్ : చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు లక్ష్య సేన్, శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన పోరులో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్ 19-21, 18-21తో వరుస సెట్లలో ఏడో సీడ్ షి యుకి చేతిలో ఓడిపోగా, 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15-21, 21-14, 13-21తో ప్రపంచ చాంపియన్ కున్లావత్ వితిద్శరన్ చేతిలో పోరాడి ఓడాడు. టాప్ 16లో నిలిచి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకున్న లక్ష్య సేన్, శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. రజావత్కూడా ఓటమిపాలయ్యాడు.