Manish Narwal | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారా షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్(ఎస్హెచ్1) వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లో మనీశ్ నార్వల్ రెండు రజత పతకాలతో మెరిశాడు. వ్యక్తిగత కేటగిరీలో మనీశ్ 236.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, చావో యంగ్ (240.3), జెంగ్డు జో (214.7) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
పీ1 పురుషుల టీమ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్హెచ్1) ఈవెంట్లో మనీశ్ నార్వల్, రుద్రాంశ్ ఖండేల్వాళ్, సంజీవ్ గిరితో కూడిన భారత త్రయం రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్హెచ్1) ఈవెంట్లో రుబినా ఫ్రాన్సిస్ 211.2 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది.