ఢిల్లీ : ఆసియా చాంపియన్షిప్స్లో భారత షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ డబుల్ ధమాకా మోగించారు. వెండి వెలుగులు విరజిమ్మడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ బెర్తు సైతం దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ రజతం సాధించగా.. మహిళల విభాగంలో 15 ఏండ్ల తిలోత్తమ కొద్దిపాటి తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకుంది. భారత్కే చెందిన రమితా జిందాల్ 230.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత విభాగంలో సత్తా చాటిన అర్జున్.. దివ్యాన్ష్ సింగ్ , హృదయ్ బృందంతో కలిసి 1892.4 స్కోర్తో దేశానికి స్వర్ణం అందించాడు.