న్యూఢిల్లీ: భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఏటీపీ ఫైనల్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ దుమ్మురేపింది.
శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-ఎబ్డెన్ జంట 6-4, 7-6 (7/5)తో వెస్లీ-నీల్ ద్వయంపై విజయం సాధించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన పోరులో బోపన్న జంట వరుస సెట్లలో ప్రత్యర్థి పని పట్టింది.