అంతాల్యా : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 పోటీలలో భారత రికర్వ్ జట్టుకు రజత పతకం దక్కింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్దీప్ రాయ్, అతాను దాస్, ధీరజ్ బొమ్మదేవరతో కూడిన భారత జట్టు షూటాఫ్లో 4-5 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. 2010 తరువాత స్వర్ణం సాధించాలనుకున్న భారత జట్టు ఫైనల్ పోరులో 0-4తో వెనుకంజలో ఉన్నప్పటికీ స్కోరు సమం చేయడంతో షూటాఫ్ అనివార్యమైంది.
షూటాఫ్లో భారత జట్టు 54-55, 50-56, 59-58, 56-55, 28-28 స్కోరుతో పోరాడి ఓడింది. కాగా వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ధీరజ్ 7-3 తేడాతో కజకిస్థాన్కు చెందిన ఇల్ఫాత్ అబ్దులిన్ను ఓడించి కాంస్యం గెలుచుకున్నాడు. దీనితో ఈ చాంపియన్షిప్ను భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో ముగించింది.