న్యూఢిల్లీ: దుబాయ్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పారా షట్లర్లు పతక జోరు కనబరిచారు. టోర్నీలో మహిళల డబుల్స్లో భారత ద్వయం మాన్సి జోషి, తులసిమతి మురుగేశన్ టైటిల్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో మాన్సి, తులసిమతి జోడీ 15-21, 21-14, 21-6తో ఇండోనేషియా జంట లీని ఒక్టిలా, కలిమతుస్ సాదియాపై గెలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తుదిపోరులో ప్రమోద్ భగత్ 17-21, 18-21తో డానియల్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు.