న్యూఢిల్లీ : భారత పారా అథ్లెట్ ఏక్తా భ్యాన్ ఈ యేడాది పారిస్లో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్కు అర్హత సాధించింది. దుబాయ్లో ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రిలో క్లబ్ ఎఫ్51 విభాగం డిస్కస్ త్రోలో ఏక్తా 17.20మీ. దూరం విసిరి అర్హత ప్రమాణాన్ని సాధించింది. ఈ విభాగంలో ఆమె ఆరో స్థానంలో నిలిచినప్పటికీ ఆసియన్ రికార్డుతో ప్రపంచ అథ్లెటిక్స్కు అర్హత పొందింది.
అంతకుముందు మహిళల వీల్చైర్ డిస్కస్ ఎఫ్53 విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. కాగా ఈ చాంపియన్షిప్లో ఇండియా నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు గెలుచుకుని 28వ స్థానంలో నిలిచింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ పారిస్లో జులై 8-17 తేదీలలో జరుగనున్నాయి.