గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో పతకాల పంట పండించిన భారత ప్యాడ్లర్లు.. బర్మింగ్హామ్లో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శరత్, సాతియాన్, మనిక బాత్రా వంటి స్టార్ ప్లేయర్లతో పాటు.. తెలంగాణ యువ కెరటం ఆకుల శ్రీజ సంచలనాలు నమోదు చేసేందుకు రెడీ అయింది.
గత క్రీడల్లో మూడు పతకాలు సాధించిన మనిక మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలువనుండగా.. శరత్, సాతియాన్ నిలకడ కొనసాగించాలని చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ల
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
2002 మాంచెస్టర్ క్రీడల నుంచి కామన్వెల్త్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్ (టీటీ)ను ప్రవేశ పెట్టగా.. ఇప్పటి వరకు భారత్ 20 పతకాలు కొల్లగొట్టింది. అందులో అత్యధికంగా గోల్డ్కోస్ట్ (2018) క్రీడల్లోనే మన ప్యాడ్లర్లు 8 పతకాలు సాధించారు. క్రితం సారి దుమ్మురేపిన మనిక బాత్రా, శరత్ కమల్, సాతియాన్ ఇప్పుడు కూడా జట్టులో ఉండటంతో ఈ సారి కూడా భారత్ అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మహిళల విభాగంలో జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మనిక తప్ప మిగిలిన ఆటగాళ్లకు పెద్దగా అనుభవం లేకపోవడం.. మహిళల టీమ్ విభాగంలో భారత పతకావకాశాలపై ప్రభావం పడే చాన్స్లు ఉన్నాయి. ఇక ఐదోసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న సీనియర్ ప్యాడ్లర్ శరత్ కమల్.. సింగిల్స్ స్వర్ణం పట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. మెగాటోర్నీకి ముందు పోర్చుగల్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం మనవాళ్లకు కలిసిరానుంది.
పురుషులు: శరత్ కమల్, జి సాతియాన్, హర్మీత్ దేశాయ్, సనిల్ శెట్టి.
మహిళలు: మనిక బాత్రా, రీత్ రిశ్య, శ్రీజ ఆకుల, దియ.