న్యూఢిల్లీ: వెటరన్ మీడియం పేసర్ జోగిందర్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్లో తొలిసారి భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర పోషించిన 39 ఏండ్ల జోగిందర్.. శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాడు. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జోగిందర్ శర్మ ఆ తర్వాత టీమ్ఇండియా తరఫున ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు. కెరీర్లో 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన జోగిందర్ ప్రస్తుతం హర్యానా పోలీస్ శాఖలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2004 నుంచి 2007 మధ్య మీడియం పేస్తో ఆకట్టుకున్న జోగిందర్.. 2012 వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు.