న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. దక్షిణా కొరియాలో జరుగుతున్న పోటీల్లో అనంత్జీత్ సింగ్, అంగద్ వీర్సింగ్, గురుజ్యోత్తో కూడిన భారత జట్టు.. స్కీట్ టీమ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 358 పాయింట్లతో స్వర్ణం ఖాతాలో వేసుకుంది.