గ్వాంగ్జూ: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు తగ్గేదేలే అంటున్నారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న టోర్నీలో శనివారం భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి.
పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, అమన్, రజత్తో కూడిన భారత జట్టు పసిడి కొల్లగొట్టగా.. వ్యక్తిగత విభాగంలో మోహన్ భరద్వాజ్ రజతం, కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో అభిషేక్-అవ్నీత్ కౌర్ జోడీ కాంస్యం చేజిక్కించుకుంది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత త్రయం 232-230తో ఫ్రాన్స్ బృందాన్ని చిత్తు చేసింది. వ్యక్తిగత విభాగంలో మోహన్ 141-149తో వైయినర్ చేతిలో ఓడి రజతం గెలుచుకున్నాడు.