బాకు (అజర్బైజాన్): ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యం పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో శివ నర్వాల్ (579 పాయింట్లు), సరబ్జ్యోత్ సింగ్ (578), అర్జున్ సింగ్ చీమ (577)తో కూడిన భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది.
చైనా (1749), జర్మనీ (1743) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకోగా.. 1734 పాయింట్లతో భారత షూటర్లు కాంస్యం కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత విభాగాల్లో భారత షూటర్లు ఆకట్టుకోలేకపోయారు.