న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఫైనల్కు దూసుకెళ్లిన తొలి భారత పురుష లాంగ్జంపర్గా చరిత్రకెక్కిన మురళీ శ్రీశంకర్.. తుది సమరంలో నిరాశ పరిచాడు. అమెరికా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్స్లో శ్రీశంకర్ 7.96 మీటర్లు లంఘించి ఏడో స్థానంలో నిలిచాడు. ఆరు ప్రయత్నాల్లోనూ శ్రీశంకర్ ఎనిమిది మీటర్ల మార్క్ అందుకోలేకపోయాడు. జినాన్ వాంగ్ (8.36 మీ, చైనా) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఓ టోర్నీలో 8.36 మీటర్ల దూరం లంఘించిన శ్రీశంకర్ ప్రపంచ అథ్లెటిక్స్లో పతకంపై ఆశలు రేపాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 8 మీటర్ల ప్రదర్శనను నమోదు చేసుకున్న భారత అథ్లెట్.. ఫైనల్లో అదే ప్రదర్శన పునరావృతం చేయలేకపోయాడు. ఇతర ఈవెంట్లలో పారుల్ చౌదరీ స్టీపుల్చేజ్ మహిళల 3000 మీటర్లలో ఫైనల్కు అర్హత సాధించలేకపోగా.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో జాబిర్ నిరాశ పరిచాడు.