న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. మెగాటోర్నీలో ఫైనల్ చేరిన భారత తొలి పురుష అథ్లెట్గా రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే కూడా తుదిపోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో శ్రీశంకర్ సరిగ్గా 8 మీటర్ల దూరం లంఘించి గ్రూప్-‘బి’ నుంచి ఫైనల్కు చేరాడు. ఓవరాల్గా అతడు ఏడో స్థానంలో నిలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత్కు ఒకే ఒక్క పతకం (అంజూ బాబీ జార్జ్; 2003 కాంస్యం) దక్కగా.. అదీ మహిళల లాంగ్జంప్లోనే కావడం విశేషం. ఇదే విభాగంలో పోటీ పడ్డ మహమ్మద్ అనీస్, జెస్విన్ అల్డ్రిన్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. ఇక 3000 మీటర్ల పురుషుల స్టీపుల్చేజ్లో అవినాశ్ 8 నిమిషాల 18.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మరోవైపు గాయం కారణంగా తజిందర్పాల్ సింగ్ తూర్ (షాట్పుట్) పోటీ నుంచి తప్పుకోగా.. 20 కిలోమీటర్ల రేస్వాక్లో సందీప్, ప్రియాంక నిరాశ పరిచారు.