మాడ్రిడ్: స్పెయిన్ వేదికగా జరిగిన ఫెజర్నెస్ స్లో బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఉప్పాల ప్రణీత్ టైటిల్ విజేతగా నిలిచాడు. శనివారంతో ముగిసిన టోర్నీలో ప్రణీత్ 6/7 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. చాంపియన్షిప్లో ఓటమి ఎరుగని ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐఎమ్లు గున్నార్, అక్సెల్ 5.5/7 స్కోర్లతో ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు టీమ్ చాంపియన్షిప్లో జీఎం ప్రణీత్, సిద్దాంత్ మహాపాత్ర, దుష్యంత్, మోక్ష్ అమిత్తో కూడిన భారత బృందం రెండో స్థానంలో నిలిచింది.