బార్సిలోనా: భారత గ్రాండ్మాస్టర్ ఎస్పీ సేతురామన్ బార్సిలోనా ఓపెన్ చెస్ టైటిల్ నెగ్గాడు. టాప్ సీడ్గా బరిలోకి దిగిన సేతురామన్ నిర్ణీత తొమ్మిది రౌండ్లలో ఓటమి ఎరుగకుండా ఆరు విజయాలు.. మూడు ‘డ్రా’లతో మొత్తం 7.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. రష్యాకు చెందిన డానిల్ యూఫా కూడా 7.5 పాయింట్లు సాధించడంతో విజేతను తేల్చేందుకు టై బ్రేక్ నిర్వహించగా.. అందులో సేతురామన్ మెరుగైన ప్రదర్శనతో
విజేతగా నిలిచాడు.