ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్కు భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎగిగైసి షాకిచ్చాడు. ఎయిమ్చెస్ రాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో కార్లసన్పై అర్జున్ విజయం సాధించాడు. ఈ టోర్నీని 19 ఏళ్ల అర్జున్ ఓటమితో ప్రారంభించాడు. మరో భారతీయుడు విదిత్ సంతోష్ గుజ్రాతీ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన అతను.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్నాడు.
స్వీడన్కు చెందిన నైల్స్ గ్రాండెలీయస్, యూఎస్ఏకు చెందిన డానియల్ నారోడిస్కీ, కార్లసన్లను వరుసగా ఓడించాడీ ఇండియన్ గ్రాండ్మాస్టర్. అయితే తర్వాతి మ్యాచ్లో పోలాండ్ ఆటగాడు జాన్ క్రిజిస్టాఫ్తో మ్యాచ్ డ్రా చేసుకున్నాడు. కార్లసన్పై అర్జున్కు ఇది తొలి విజయం కావడం గమనార్హం. గత నెల జరిగిన జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ టోర్నమెంట్లో కార్లసన్ చేతిలో ఓడిన అర్జున్.. ఈసారి 54 ఎత్తుల్లో కార్లసన్ను చిత్తుచేసి పగతీర్చుకున్నాడు.