న్యూఢిల్లీ: 2022 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో తలపడేందుకు ఈ నెల 19న భారత ఫుట్బాల్ జట్టు ఖతార్కు వెళ్లనుంది. రెండు వారాల ప్రాక్టీస్ అనంతరం వచ్చే నెలలో ఖతార్ (జూన్ 3), బంగ్లాదేశ్ (జూన్ 7), ఆఫ్ఘనిస్థాన్ (జూన్ 15)తో టీమ్ఇండియా తలపడనుంది. అయితే ప్రపంచకప్ రేసు నుంచి దాదాపు ఇప్పటికే నిష్క్రమించిన భారత జట్టు.. ఈ మ్యాచ్ల్లో గెలిచి 2023 ఆసియాకప్లో అర్హత అవకాశాలను మెరుగుపరుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఆసియాకప్కు కూడా ఇవి క్వాలిఫయింగ్ మ్యాచ్లుగా ఉన్నాయి. ప్రాక్టీస్ కోసం తమ జట్టును ముందుగానే అనుమతించాలన్న అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అభ్యర్థనను ఖతార్ అంగీకరించడంతో 19నే టీమ్ఇండియా పయనం కానుంది.