సోఫియా (బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మెమోరియల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు సత్తాచాటారు. అనామిక, అనుపమ తమ తమ విభాగాల్లో ఫైనల్కు దూసుకెళ్లి.. పతకాలు ఖాయం చేసుకున్నారు. మహిళల 50 కేజీల విభాగంలో అనామిక 4-1తో ఫ్రాన్స్ బాక్సర్ వాసిలాపై విజయం సాధించింది. దాదాపు ఏకపక్షంగా సాగిన పోరులో అనామిక వరుస పంచ్లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
81 కేజీల సెమీఫైనల్లో అనుపమ 3-2తో జెస్సిక (ఆస్ట్రేలియా)పై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన బౌట్లో ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైన కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన అనుపమ ఫైనల్కు దూసుకెళ్లింది.