టోక్యో: మరో ఇండియన్ బాక్సర్ ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలోనే ఆగిపోయాడు. 91 కేజీల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఆదివారం జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో ఇండియన్ బాక్సర్ సతీష్కుమార్.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ చేతిలో 0-5తో ఓడిపోయాడు. తొలి రౌండ్ నుంచే సతీష్పై పూర్తిగా పైచేయి సాధించిన జలలోవ్ను ఏకగ్రీవంగా ఐదుగురు జడ్జీలు విజేతగా ప్రకటించారు. ప్రతి రౌండ్లోనూ జడ్జీలు జలలోవ్ వైపే మొగ్గుచూపారు. ప్రత్యర్థి విసిరిన బలమైన పంచ్ల ముందు సతీష్ నిలవలేకపోయాడు.