లా నుసియా (స్పెయిన్): భారత బాక్సర్ రవీన ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. 63 కిలోల విభాగం ఫైనల్లో రవీన నెదర్లాండ్స్కు చెందిన మెగాన్ డిక్లెర్పై 4-3తో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో సాంకేతికంగా ప్రత్యర్థికంటె మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆసియా యూత్ స్వర్ణ విజేత రవీనకు రెఫరీలు ఎక్కువ పాయింట్లు కేటాయించారు. కాగా 81ప్లస్ విభాగం ఫైనల్లో కీర్తి ఐర్లాండ్ బాక్సర్ క్లియోన ఎలిజిబెత్ డిఆర్సి చేతిలో 0-5తో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. ఈ చాంపియన్షిప్లో భారత్ మొత్తం 11 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
won gold in the