Asian Para Games | హాంగ్జౌ : ప్రతిష్ఠాత్మక నాలుగో పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 111 పతకాలతో భారత క్రీడా యవనికపై అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. చైనాలోని హాంగ్జౌలో శనివారం మన అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో పతకాల సంఖ్య వంద మార్క్ దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో 29 బంగారు, 31 వెండి, 51 కాంస్య పతకాలు నెగ్గడంతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.