హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ ఉయ్యాల మోహన హర్ష రజత పతకంతో మెరిశాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఫాజా అంతర్జాతీయ చాంపియన్షిప్ టీ47 పురుషుల 100 మీటర్ల పరుగులో హర్ష రెండో ప్లేస్లో నిలిచాడు.
11.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం కైవసం చేసుకున్నాడు. నూర్ ఫెర్రీ (11.12 సెకన్లు; ఇండోనేషియా), మహమ్మద్ హాషిమ్ (11.50 సెకన్లు; ఈజిప్ట్) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు.