బెర్లిన్: ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు దుమ్మురేపుతున్నారు. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ సెమీస్లో భారత ఆర్చరీ త్రయం జ్యోతి సురేఖ, పర్నీత్కౌర్, అదితి స్వామి 220-216 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొలంబియాపై సంచలన విజయం సాధించించి ఫైనల్ పోరులో నిలిచింది.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో భారత ఆర్చర్లు అద్భుత పోరాట పటిమ కనబరిచారు. మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగంతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ఆర్చర్లకు నిరాశే ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్కు తొలి అర్హత టోర్నీ అయిన ఇందులో మన ఆర్చర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో సఫలం కాలేకపోయారు. గురువారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో పోటీలు మొదలుకానున్నాయి.