IND vs WI : సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) టాస్ గెలిచాడు. వికెట్ అనుకూలంగా ఉంటుందని మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. విండీస్ జట్టు ఒక్క మార్పుతో ఆడుతోంది. ఒబెడ్ మెక్కాయ్ స్థానంలో అల్జారీ జోసెఫ్ను తీసుకున్నామని రొవమన్ పావెల్ (Rovman Powell) చెప్పాడు. నాలుగో టీ20లో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(84 నాటౌట్), శుభ్మన్ గిల్(77) దంచి కొట్టడంతో టీమిండియా సిరీస్ సమం చేసింది.
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, షై హోప్ , నికోలస్ పూరన్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), ఒడియన్ స్మిత్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్.