హాంగ్జూ: భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నారు. ఆసియా క్రీడల్లో(Asian Games) మన అథ్లెట్ల ప్రదర్శన సరికొత్త రికార్డులు సృష్టించింది. హాంగ్జూలో జరుగుతున్న గేమ్స్లో ఇప్పటి వరకు ఇండియా 71 పతకాలను కైవసం చేసుకున్నది. ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియాకు అత్యధిక సంఖ్యలో పతకాలు రావడం ఇదే మొదటిసారి. ఇవాళ ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో ఇండియా తన ఖాతాలో ఓ గోల్డ్ మెడల్ వేసుకున్నది. దీంతో ఇండియా మెడల్ ట్యాలీ పెరిగిపోయింది.
✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨
With this gold in archery, 🇮🇳’s medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅
Our athletes’ dedication and hard work have made this moment possible🔥
Let’s keep the cheers… pic.twitter.com/mgrB9ackxV
— SAI Media (@Media_SAI) October 4, 2023
గతంలో భారత్ ఆసియా క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలను గెలుచుకున్నది. ఇప్పుడు ఆ రికార్డును తాబ అథ్లెట్ల బృందం బ్రేక్ చేసింది. జకర్తాలో 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో ఇండియా 70 మెడల్స్ గెలుచుకున్నది. ఆ ఏడాది 16 స్వర్ణాలు, 23 సిల్వర్, 31 కాంస్య పతకాలను ఆ బృందం తన ఖాతాలో వేసుకున్నది. ఈసారి ఇప్పటికే 16 గోల్డ్, 26 సిల్వర్, 29 కాంస్య పతకాలను ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఇవాళ ఉదయం 35 కిలోమీటర్ల మిక్స్డ్ రేస్ వాక్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకం వచ్చింది. మంజూ రాణి, రామ్ బాబూ ఆ మెడల్ను గెలుచుకున్నారు. ఆ పతకంతోనే జకర్తా మెడల్ ట్యాలీని ఇండియా సమం చేసింది. ఇండియా రికార్డు స్థాయిలో మెడల్స్ సాధించడం పట్ల సంతోషంగా ఉందని చీఫ్ డిమిషన్ భూపేందర్ సింగ్ బాజ్వా తెలిపారు.