ఢాకా: ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ ఆడనుంది. ఆఖరి వన్డేలో ‘మన్కడింగ్’తో వార్తల్లోకెక్కిన హర్మన్ప్రీత్ బృందం.. అవన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టిపెట్టేందుకు సిద్ధమైంది. శనివారం జరుగనున్న తొలి పోరులో శ్రీలంకతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో మన అమ్మాయిలు నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నా.. ఆసియా వరకైతే హర్మన్ప్రీత్ బృందం ఫేవరెట్ అనే చెప్పొచ్చు. క్రితం సారి జరిగిన ఆసియాకప్ మినహాయించి ఇప్పటి వరకు ఆరుసార్లు భారత్ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.