Kabaddi World Cup : క్రికెట్లోనే కాదు కబడ్డీలోనూ భారత మహిళలు జగజ్జేతలుగా నిలిచారు. కబడ్డీ ప్రపంచకప్(Kabaddi World Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ వరుసగా రెండో ఏడాది టైటిల్ కొల్లగొట్టారు. సోమవారం జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుపై 35-28తో టీమిండియా జయకేతనం ఎగురువేసింది. తమదైన ఉడుంపట్టుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన రీతూ నేగీ (Ritu Negi) బృందం సూపర్ విక్టరీతో మువ్వన్నెల జెండానె రెపరెపలాడించింది.
ఢాకాలో జరిగిన కబడ్డీ ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశ నుంచి అదరగొట్టింది. సెమీ ఫైనల్లో కఠినమైన ప్రత్యర్థి ఇరాన్ను చిత్తు చేసింది. ఆసియా దేశంపై 33-21తో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించిన భారత్ ఫైనల్లోనూ అదే జోరు చూపించింది.
🚨 THIS IS PRETTY HUGE NEWS FOLKS 💥
WORLD CUP WINNING MOMENTS FOR INDIA 🏆
Indian Women’s Team defeated Chinese Taipei 35-28 in the Finals of Kabaddi World Cup 2025!
Our Girls successfully defends the Trophy 🇮🇳💙 pic.twitter.com/rEp45Qu6aW
— The Khel India (@TheKhelIndia) November 24, 2025
మరోవైపు చైనీస్ తైపీ సైతం అజేయంగా ఫైనల్ చేరింది. సెమీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ను 25-18తో ఓడించిందా జట్టు. కానీ, హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో భారత మహిళలు ఉడుంపట్టుతో చైనీస్ తైపీకి చెక్ పెట్టారు. కెప్టెన్ రీతూ నేగీ, వైస్ కెప్టెన్ పుష్ప రానాలు రైడింగ్లో రాణించగా.. చంపా ఠాకూర్, భావ్నా ఠాకూర్, సాక్షి శర్మలు సైతం మెరవడంతో టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంది.