న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియన్ ప్రపంచకప్లో భారత్ రజతం కొల్లగొట్టింది. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగగా హోరాహోరీగా జరిగిన తుది పోరులో పసిడి పతకాన్ని తృటిలో చేజార్చుకున్న భారత జోడీ స్విప్ట్ కౌర్ సమ్ర- సూర్యప్రతాప్ సింగ్ రన్నరప్గా నిలిచింది. జర్మనీ వేదికగా గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ ప్రొన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సమ్ర-సూర్య ద్వయం 15-17 తేడాతో మజా మగ్దలెన గవెండ (పొలాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడింది.
అద్భుత ప్రదర్శనతో ఓటమెరుగకుండా వచ్చిన భారత జోడీ తుదిపోరులో తడబడింది. భారత షూటర్లు పోలిష్ జోడీకి ముచ్చెమటలు పట్టించింది. చివరకు ఫలితం అటువైపు తిరగడంతో భారత్ రజతంతో సరిపెట్టుకుంది. బుధవారం భారత మహిళల స్కీట్ బృందం పరినాజ్ ధలివాల్, దర్శన రాథోర్, అరీబా ఖాన్ 6-0తో గెలిచి కాంస్యం నెగ్గిన విషయం తెలిసిందే. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్-విజయ్వీర్ సిధూ స్వర్ణం పొందగా.. ఓడిపోయిన భారత జోడీ అనీశ్-తేజస్వినీ రజతం కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 33 పతకాలతో (13 స్వర్ణం, 15 రజతం, 5 కాంస్యం) పొందింది.