మహాబలిపురం: ప్రతిష్ఠాత్మ చెస్ ఒలింపియాడ్లో ఆతిథ్య భారత్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా మన గ్రాండ్మాస్టర్లు దూసుకెళుతున్నారు. ఓపెన్ విభాగంలో భారత జట్టు 3.5-1.5 తేడాతో మాల్దోవాపై అద్భుత విజయం సాధించింది. హరికృష్ణ, నారాయణన్, శశికిరణ్ కృష్ణన్ ప్రత్యర్థులపై విజయాలు సాధించగా, తెలంగాణ యువ జీఎం అర్జున్..అండ్రెతో గేమ్ను డ్రా చేసుకున్నాడు.
మిగతా గేముల్లో భారత్-2 టీమ్ 4-0తో ఎస్తోనియాపై, భారత్-3 జట్టు 2.5-1.5తో మెక్సికోపై గెలిచి ముందంజ వేశాయి. మహిళల విభాగంలో భారత్ జట్టు 3.5-1.5తో అర్జెంటీనాపై గెలిచింది. జురియల్ మారిసాతో గేమ్ను హంపి డ్రా చేసుకోగా, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి విజయాలు సాధించారు. భారత్-2 టీమ్ 3.5-1.5తో లాత్వియాపై భారత్-3 జట్టు 3-1తో సింగపూర్పై గెలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పింది.