న్యూఢిల్లీ: ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో మన అమ్మాయిలు రజత పతకం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భాగంగా హాంకాంగ్పై రెండు మ్యాచ్లు నెగ్గిన భారత్.. ఆతిథ్య థాయ్లాండ్పై ఒక మ్యాచ్ నెగ్గి మరో మ్యాచ్లో ఓటమి పాలైంది. ఈ ప్రదర్శనతో మన జట్టు ప్రపంచ యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్నకు అర్హత సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో సీనియర్ మహిళల జట్టు కాంస్యం చేజిక్కించుకుంది.