నేపియర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగాటోర్నీల విషయం పక్కన పెడితే.. ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. మరో సిరీస్ క్లీన్స్వీప్ చేసేందుకు రెడీ అయింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరు వర్షార్పణం కాగా.. రెండో టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. మంగళవారం ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరుగనుంది. దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్తో పాటు జమ్ము ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్కు ఈ మ్యాచ్లోనైనా అవకాశం దక్కుతుందా చూడాలి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండబోవడం లేదు.