WestIndies Vs India | వెస్టిండీస్తో మంగళవారం జరుగున్న మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ టాస్ గెలుచుకున్నాడు. అయితే వెస్టిండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. బాసెటెర్రెలోని వార్నర్ పార్క్లో ఈ టీ-20 మ్యాచ్ జరుగుతున్నది.
ఐదు టీ-20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో వెస్టిండీస్, టీం ఇండియా చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. దీంతో సిరీస్ 1-1 తేడాతో సమమైంది. మూడో టీ-20లో రవీంద్ర జడేజా స్థానంలో దీపక్ హుడా రానున్నాడు.