IND vs SL : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 20 ఓవర్లలో 228 పరుగులు భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లను ఊచకోత కోసిన సూర్య 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీమిండియా తరఫున వేగవంతమైన టీ20 సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 2017 శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. టీ20ల్లో అతనికి ఇది మూడో శతకం. తన స్టయిల్ స్కూప్ షాట్లతో సూర్య లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి సూర్య స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో అక్షర్ పటేల్(21) విధ్యంసం సృష్టించాడు. 9 బంతుల్లో 4 ఫోర్లు బాదాడు.
రెండు మ్యాచుల్లో విఫలమైన శుభ్మన్ గిల్ 48 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 35 రన్స్తో రాణించారు. దీపక్ హుడా (4), హార్ధిక్ పాండ్యా (4)ఇషాన్ కిషన్ (1) విఫలం అయ్యారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక రెండు వికెట్లు పడగొట్టాడు. రజిత, కరుణరత్నే, హసరంగ తలా ఒక వికెట్ తీశారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టీ 20లో ఇండియా 2 పరుగులతో గెలిచింది. రెండో టీ20లోశ్రీలకం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.