సిల్హెట్: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మహిళల ఆసియాకప్లో శుక్రవారం దాయాది పాకిస్థాన్ను ఢీకొట్టనుంది. గత రెండు మ్యాచ్లలో ఎనిమిది మార్పులతో ప్రయోగాలు చేసి విజయాలందుకున్న హర్మన్ప్రీత్ బృందాన్ని.. గురువారం థాయిలాండ్ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలైన పాకిస్థాన్ ఏ మేరకు ప్రతిఘటించగలదన్నది సందేహమే. జెమీ మా రోడ్రిగ్స్ ఫుల్ ఫామ్లో ఉండగా.. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ మంచి టచ్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత్కు తిరుగేలేదు.