అహ్మాదాబాద్: ఐసీసీ వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇండియా, పాకిస్థాన్(India vs Pakistan) మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ నిర్వహించే తేదీని భద్రతా కారణాల దృష్ట్యా మార్చే అవకాశం ఉంది. ఆ రోజునే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి, అయితే గుజరాత్లో ఆ ఉత్సవాలను గ్రాండ్గా నిర్వహిస్తారు. దీంతో ఆ రోజు మ్యాచ్ నిర్వహణకు సెక్యూర్టీ కారణాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ తేదీని మార్చే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ తేదీని మార్చితే మాత్రం చాలా వరకు లాజిస్టిక్ సమస్యలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే చాలా మంది అభిమానులు ఆ మ్యాచ్కు టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇక స్థానిక హోటళ్లు కూడా దాదాపు బుకింగ్ అయిపోయాయి. అయితే మ్యాచ్ నిర్వహణ తేదీని మార్చడం అంటే చాలా కష్టమే అని, కానీ సెక్యూర్టీని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ నిర్ణయం అమలు చేయక తప్పదని అధికారులు అంటున్నారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం ప్రేక్షకుల సామర్థ్యం లక్ష ఉంటుంది. ఆ వేదికగా వరల్డ్కప్లో దాదాపు నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మాదాబాద్లో అక్టోబర్ కోసం హోటళ్లుఇప్పటికే ఫుల్ అయిపోయాయి. గర్భా సీజన్తో పాటు క్రికెట్ మ్యాచ్లు ఉన్న కారణంగా ఆ నగరం కిక్కిరిసిపోనున్నది. తాజా సమాచారం ప్రకారం ఆ మ్యాచ్ను ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 14వ తేదీన నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ICC Men's Cricket World Cup | India versus Pakistan match likely to be rescheduled on October 14. It is originally scheduled for October 15. Security agencies advise BCCI for this, as the date for the start of Navratri clashes with the match day: Sources
— ANI (@ANI) July 26, 2023