న్యూఢిల్లీ: స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్ల తేదీలు మారాయి. నవరాత్రి ఉత్సవాలు, పలు భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుంటూ మెగాటోర్నీలో తొమ్మిది మ్యాచ్లను ఐసీసీ రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది.
కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ పోరు అక్టోబర్ 15న కాకుండా 14న అహ్మదాబాద్లో జరుగనుంది. నవంబర్ 11న జరుగాల్సిన భారత్, నెదర్లాండ్స్ పోరు 12వ తేదీకి మారింది.