టీ20 ప్రపంచకప్లో సూపర్ 12 మ్యాచ్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియా ఒక మ్యాచ్ ఆడి ఘోర పరాజయం పాలు అయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 24న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. దీంతో తదుపరి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇండియాకు ఏర్పడింది.
ఇవాళ రాత్రి 7.30 కు దుబాయ్ స్టేడయింలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య పోరు జరగనుంది. ఇండియా, న్యూజిలాండ్.. రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్. రెండు జట్లు పాకిస్థాన్ చేతిలోనే ఓడిపోయాయి. రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో కిందికి వెళ్లిపోయాయి.
గ్రూప్ 2లో పాకిస్థాన్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆఫ్ఘనిస్థాన్ రెండో ప్లేస్లో ఉంది. నమీబియా మూడో స్థానం, ఆ తర్వాత న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఇండియా ఉంది. ఆ తర్వాత చివరి స్థానంలో స్కాట్లాండ్ ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మూడో స్థానానికి ఎగబాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మ్యాచ్లలోనూ వరుసగా గెలిస్తేనే సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే రెండు జట్లలో ఒక జట్టు సెమీ ఫైనల్స్ ఆశను వదులుకోవాల్సిందే. దానికి ఈ మ్యాచే ప్రామాణికం కానుంది.
టీమిండియా కూడా ఈ మ్యాచ్పైనే ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆడబోయేది చిన్న టీమ్స్తోనే కాబట్టి.. ఈ మ్యాచ్లో గెలిచి తమ సత్తా చాటాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. అందుకే.. ఈ సారి న్యూజిలాండ్ను చిత్తు చేసేందుకు విరామం లేకుండా ప్రాక్టీస్ చేశారు. ఇంకొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొద్ది గంటల్లో న్యూజిలాండ్తో భారత్ ఢీ.. బోణీ కోసం ఇరుజట్లు తహతహ