నేపియర్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడవ టీ20 మ్యాచ్ టై అయ్యే అవకాశాలు ఉన్నాయి. 161 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 9 ఓవర్లు ముగిసే వరకు నాలుగు వికెట్ల నష్టానికి 75 రన్స్ చేసింది. అయితే ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ను నిలిపేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఒకవేళ ఇండియా గెలవాలంటే 75 రన్స్ కన్నా ఎక్కువ చేయాలి. కానీ డక్వర్త్ రూల్ ప్రకారం స్కోర్లు సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ను టైగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మ్యాచ్ ఆగిన సమయంలో పాండ్యా 30, హుడా 9 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఒకవేళ మ్యాచ్ను టైగా ప్రకటిస్తే, అప్పుడు సూపర్ ఓవర్ వేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షం ఆగింది. పిచ్పై నుంచి కవర్స్ తీస్తున్నారు. మ్యాచ్ ఏ సమయంలోనైనా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ జరగకుంటే సిరీస్ను ఇండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంటుంది.
అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 160 రన్స్కు ఆలౌటైంది. కాన్వే, ఫిలిప్స్ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్కు గౌరవ ప్రదమైన స్కోర్ను అందించారు. కాన్వే 59, ఫిలిప్స్ 54 రన్స్ చేశారు. నిజానికి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కివీస్ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. మూడవ వికెట్కు కాన్వే, ఫిలిప్స్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నది. ఆ ఇద్దరూ మూడో వికెట్కు 86 రన్స్ జోడించారు.