IND vs BAN : చివరిదైన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. నామమాత్రమైన ఈ మ్యాచ్లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శిఖర్ ధావన్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్, కోహ్లీ బౌండరీలతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే ఇషాన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. అతను 210 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీ శతకం చేశాడు. ఇది కోహ్లీకి 72వ అంతర్జాతీయ సెంచరీ. అత్యధిక సెంచరీ జాబితాలో అతను రికీ పాంటింగ్ను దాటేశాడు. భారత జట్టు జోరు చూస్తే 450 స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ 113 రన్స్ వద్ద కోహ్లీ వెనుదిరిగాడు. మరోసారి కేఎల్ రాహుల్ 8 రన్స్, శ్రేయాస్ అయ్యార్ 3 స్కోర్తో నిరాశ పరిచారు. చివర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (20 రన్స్) , వాషింగ్టన్ సుందర్ (37 పరుగులు) ధాటిగా ఆడడంతో భారత్ 400 పరుగులు చేసింది. అయితే చివరి ఓవర్లలో వరుసగా వికెట్లో కోల్పోవడంతో బంగ్లాదేశ్కు ఇండియా 410 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్, షకిబుల్ హసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ముస్తాఫిజుర్ రెహమాన్, మెహదీ మిరాజ్ చెరో వికెట్ తీశారు. అయితే.. మూడు వన్డేల సిరీస్లో మొదటి రెండు వన్డేల్లో గెలిచిన బంగ్లాదేశ్ ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది.