India vs Australia | ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ ((Border Gavaskar Trophy)) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Ind vs Aus) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 289/3తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన టీమ్ఇండియా లంచ్ బ్రేక్ సమయానికి 131 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (Virat kohli) (88), శ్రీకర్ భరత్(28) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్కు వీరిద్దరూ 53 పరుగులను జోడించారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 118 పరుగులు వెనకబడి ఉంది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 289/3తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా కాసేపటికే రవీంద్ర జడేజా (28) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. మర్ఫీ బౌలింగ్లో షాట్ కొట్టడానికి ప్రయత్నించిన జడేజా మిడాన్లో ఖావాజా చేతికి చిక్కాడు.