లాసానే: ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో స్పెయిన్తో తలపడనుంది. స్వదేశం వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న మెగాటోర్నీలో జనవరి 13న రూర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ స్టేడియంలో భారత్ బరిలోకి దిగనుంది.
పూల్-డీలో ఉన్న టీమ్ఇండియా..జనవరి 15వ తేదీన ఇంగ్లండ్తో, 19న వేల్స్తో ఆడుతుంది.