బర్మింగ్హామ్: ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
హాంకాంగ్ షట్లర్తో ఆడిన గత మూడు మ్యాచ్ల్లో ఓడిన సేన్.. గంటా 18 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో మాత్రం అతడికి షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టో 19-21, 2-9తో సె యింగ్, టాంగ్ చున్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది.