టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఇండియా అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. దీంతో న్యూజిలాండ్ ఎదుట స్వల్ప లక్ష్యం ఉంది. 111 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్ నిర్ధేశించగలిగింది.
భారత్ను రవీంద్ర జడెజా ఆదుకున్నాడు. 19 బంతుల్లో 26 పరుగులు చేసి నాట్ అవుట్గా జడెజా నిలిచాడు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా 24 బంతుల్లో 23 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 17 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. కానీ.. వికెట్లను ఏమాత్రం కాపాడుకోలేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్మెన్ తట్టుకోలేకపోయారు. దీంతో స్వల్ప స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
కిషన్.. 8 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్.. 16 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 14 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్.. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి కేవలం 20 పరుగులు మాత్రమే అందించాడు. సౌథీ.. 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 26 పరుగులు అందించాడు. మిల్నే 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసి 30 పరుగులు అందించాడు. ఇష్ సోధీ.. 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 17 పరుగులు అందించాడు. సాంత్నర్.. 4 ఓవర్లు వేసి 15 పరుగులు అందించాడు.