రూర్కెలా: ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో క్వార్టర్స్ బెర్తు దక్కించుకోలేకపోయిన భారత్..వర్గీకరణ మ్యాచ్లో భారీ విజయం సాధించింది. గురువారం జపాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 8-0 తేడాతో విజయదుందుభి మోగించింది. నాకౌట్కు అర్హత సాధించలేకపోయామన్న కసిని భారత ప్లేయర్లు గోల్స్ రూపంలో చూపించారు. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో టీమ్ఇండియా తరఫున అభిషేక్ (35ని, 43ని), హర్మన్ప్రీత్సింగ్ (45ని, 58ని) డబుల్ గోల్స్ చేయగా, మన్దీప్సింగ్ (32ని), వివేక్సాగర్ (39ని), మన్ప్రీత్సింగ్ (58ని), సుఖ్జీత్సింగ్ (59ని)గోల్స్ చేశారు. 9 నుంచి 12 స్థానాల కోసం శనివారం జరిగే వర్గీకరణ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది.