న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో మన అమ్మాయిలు 1-0తో ఆతిథ్య జపాన్ను చిత్తుచేశారు. దీంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచకప్నకు అర్హత సాధించింది.
ఈ ఏడాది చివర్లో శాంటియాగోలో జరుగనున్న వరల్డ్కప్లో మన అమ్మాయిలు బరిలోకి దిగనున్నారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో భారత్ తరఫున సునేలితా (47వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది.