PV Sindhu | వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత్ బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు శనివారం ఇండియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ సెమీస్లో ఓటమి పాలయ్యారు. గతేడాది ఇండోనేషియా మాస్టర్స్లో పోటీ ఓడించిన థాయిలాండ్ ప్లేయర్ కటేథాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 14-21, 21-13, 10-21 పాయింట్ల తేడాతో పీవీ సింధు ఓటమి పాలైంది.
ఇదే టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్లో మలేషియా 60వ ర్యాంకర్ యోంగ్ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి ఫైనల్స్కు క్వాలిఫై అయ్యాడు. ఫైనల్స్లో సింగపూర్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ లో కియా యూతో సమరానికి సిద్ధమయ్యాడు.
ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్.. క్వార్టర్ఫైనల్లో సహచర భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచి సెమీస్కు చేరాడు. కాగా, ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు కరోనా బారీన పడ్డారు.