మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అదే ఊపులో సెంచరీకి చేరువవుతాడని అంతా భావించారు కానీ.. ఫ్రైలింక్ బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో 56 పరుగులు చేసి రోహిత్ శర్మ వెనుదిరగడంతో క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, సూర్య కుమార్ ఇద్దరు ఉన్నారు. కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు భారత్.. ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది.