SAFF Championship 2023 : దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత్(India), కువైట్(Kuwait) మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది.డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కువైట్ ఆటగాడు హమద్ అల్కల్లాఫ్(Hamad Alqallaf) భారత ప్లేయర్ సహల్ సమద్(Sahal Samad)ను కిందకు తోసేశాడు. అది చూసిన మరో భారత ఆటగాడు రహీం అలీ(Rahim Ali), సహల్ను నెట్టేశాడు. దాంతో, మ్యాచ్ రిఫరీ వీళ్లిద్దరికీ రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపించాడు.
టేబుల్ టాపర్స్ అయిన భారత్, కువైట్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదవ్వలేదు. రెండో అర్ధ భాగంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ కొట్టాడు. అయితే.. ఆట ముగుస్తుందనగా కువైట్ ఆటగాడు అన్వర్ అలీ గోట్ చేశాడు. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లో నెగ్గిన భారత్ మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 4-0తో నెగ్గిన భారత్.. మలి పోరులో 2-0తో నేపాల్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.